నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలి : కార్పొరేటర్ హారిశంకర్ రెడ్డి

Published: Wednesday July 14, 2021
మేడిపల్లి, జూలై13 (ప్రజాపాలన ప్రతినిధి) : నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదనీ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హారిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ దొంతిరి హారిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని  విహారిక కాలనీలో  ప్రతి ఇంటికి 6 మొక్కల పంపిణీ చేశారు. మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డిి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ పాల్గొని కాలనీ వాసులకు మొక్కల పంపిణీీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  దొంతిరి హారిశంకర్ రెడ్డి మాట్లాడుతూ  డివిజన్ను హరితవనంగా మార్చడానికి కమిటీ సభ్యులు, కాలనీల పెద్దలు, మహిళ మణులు, కాలనీ వాసుల సహకారంతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సునీల్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, రాజేశ్వరి, సత్యనారాయణ, మహేందర్, యాదగిరి రామకోటి, రవీందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, లక్ష్మ రెడ్డి, మోహన్ రెడ్డి, మధు, విజయ్, రాజేందర్, మారుతి, రాజు నాయక్, మహేష్, శివరాజ్, సంతోష్ రెడ్డి, సత్యం చారి, శేఖర్ రెడ్డి మరియు కాలనీ వాసులకు తదితరులు పాల్గొన్నారు.