ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 28ప్రజాపాలన ప్రతినిధి * *బిఆర్ఎస్ సర్కార్ ఆటలు చెల్లవు బిజెపి**

Published: Wednesday March 01, 2023
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బిఆర్ఎస్ సర్కార్ కు ఇదే చివరి రోజులని మళ్లీ అధికారులోకి వచ్చే పరిస్థితి లేదని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కె. ప్రకాశ్ రెడ్డి అన్నారు  ప్రజాగోస బిజెపి భరోసా లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీలో బూతుల సంఖ్య 229, 230, 231 శక్తి కేంద్రం ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బచ్చిగల రమేష్ అధ్యక్షతన జరిగిన కార్నర్ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రకాష్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లోకి నెట్టేసిన బిఆర్ఎస్ సర్కార్ కు రాబోయే ఎన్నికల్లో జనం బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ప్రభుత్వం మోసపూరితమైన మాయమాటంతో ప్రజలను తప్పుడు వాగ్దానంతో మోసం చేసి అధికారులకు వచ్చి 9 సంవత్సరాలు కావస్తున్న ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎందరో బలిదానాల, త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా రాష్ట్రం లో బిజెపికి పట్టం కట్టాలని ఆయన ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు తూళ్ళ నరసింహ గౌడ్ తుర్కయంజాల్ రైతు సేవ సకరం సంఘం వైస్ చైర్మన్ కొత్త రామ్ రెడ్డి  రాష్ట్ర నాయకులు కొండ్రు పురుషోత్తం సానం అంజయ్య పలుస శ్రవణ్ కుమార్ గౌడ్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్  శ్రీలత అనిల్ కుమార్, మైలారం బాబు, ప్రధాన కార్యదర్థులు మాధు, శ్రీకాంత్ రెడ్డి,యంజాల శ్రీనివాస్ రెడ్డి, మహిళా నాయకురాళ్లు తూళ్ళ వసంత, మారగౌని సునీత, బీజేవైఎం జిల్లా నాయకులు మల్లెల ప్రేమ్ సాయి, బూతు అధ్యక్షులు నాయిని చంద్రమోహన్, దేశగౌని సురేందర్, ఖానపురం లక్ష్మణ్, కాంచనాని దాస్, బాలకృష్ణ,అజయ్ గౌడ్, ముదిగొండ నర్సింహ  ముఖ్య కార్యకర్తలు