రోడ్డు ప్రమాదంలో రేషన్ డీలర్ కి తీవ్ర గాయాలు

Published: Friday July 15, 2022

బోనకల్, జులై 15 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి - కలకోట గ్రామాల మధ్య నర్సరీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ సంగాపు నరసింహారావు తన ద్విచక్ర వాహనంపై మధిర బయలుదేరాడు. మధిర సివిల్ సప్లై ఆఫీసులో రేషన్ ఇచ్చే మిషన్లు తీసుకొచ్చుకునేందుకు నరసింహారావు మధిర వెళుతున్నాడు. అయితే నర్సరీ సమీపంలో ఎదురుగా కుక్క అడ్డు రావడంతో నరసింహారావు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో నరసింహారావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం అందించి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.