కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా వృక్షార్చన కార్యక్రమం

Published: Thursday February 18, 2021
మధిర, ఫిబ్రవరి 17, ప్రజాపాలన: ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామం లో కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటివృక్షార్చన కార్యక్రమం లో భాగంగా బనిగండ్లపాడు గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగా పుల్లా రెడ్డి గారు, గ్రామ అధ్యక్షుడు నీలం  రవి గారు, మండల మహిళా అధ్యక్షురాలు శీలం ఉమా మహేశ్వరి గారు, పెద్ద గోపవరం సొసైటీ చైర్మన్ శీలం అక్కి రెడ్డి గారు, యెన్నం సత్యనారాయణ రెడ్డి గారు, వెంకట్రావు గారు, బాణాల రామకోటయ్య గారు, ఎదురు కృష్ణారెడ్డి గారు, వార్డు మెంబరు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పలువురు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రుపాలెం మండలం లో కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన  కార్యక్రమంలో భాగంగా ఎర్రుపాలెంలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష గారు, జడ్పీటీసీ శీలం కవిత గారు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలి అప్పారావు గారు, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు వైస్ ఎంపిపి రామకోటయ్య గారు, డి సి సి బి డైరెక్టర్ ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావ రామకృష్ణ గారు, ఎంపీటీసీ కత్తులు గారు, గ్రామ అధ్యక్షుడు రాము గారు, మండల మహిళా అధ్యక్షురాలు శీలం ఉమా మహేశ్వరి గారు, మండల కార్యదర్శి నారాయణ గారు, బాబుషా గారు, బాజీ గారు, చిరంజీవి, రవి, పంపి శివ, తిరుపతి రావు గారు, బాలాజీ, పలువురు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.