గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ శాఖ ఎంపికలు

Published: Monday September 13, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని ఆదివారం టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఎం తుర్కపల్లి, ముద్దాపురం, మోగిలిపాక, వెంకటాపురం, వేములకొండ, పహిల్వాను పురం గ్రామాల్లో గ్రామశాఖలను ఎన్నుకున్నారు. ఎం తుర్కపల్లి అధ్యక్షుడుగా బెల్లి నర్సింహ, ప్రధాన కార్యదర్శిగా దనీరేకుల లింగయ్య, ముద్దాపురం అధ్యక్షుడుగా వాకిటి ధర్మారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాయిని నర్సిరెడ్డి, మోగిలిపాక అధ్యక్షుడుగా భీమనబోయిన భిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా జడిగే మహేష్, వెంకటాపురం అధ్యక్షుడుగా జెట్టి నరేష్, ప్రధాన కార్యదర్శిగా జక్కుల ఐలయ్య, వేములకొండ అధ్యక్షుడుగా సాయిని నాగేష్,ప్రధాన కార్యదర్శిగా ఇంజమూరి రామ లక్ష్మయ్య, పహిల్వాన్ పురం అధ్యక్షుడుగా గూడూరు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రేపాక నర్సింహ లను ఏకగ్రీవంగా ఎందుకున్నట్లు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డేగల పాండు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి ఎంపిటిసి తుమ్మల వెంకట్ రెడ్డి, మచ్చ గిరి దేవస్థానం ఛైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, సర్పంచులు కొత్త నర్సింహ, తుమ్మల వెంకట్ రెడ్డి, బోడ లక్ష్మమ్మ బాలయ్య, నాయకులు రమేష్, శంకరయ్య, ఆకుల వెంకటేష్, జనార్ధన్ రెడ్డి, మహేష్, సత్యనారాయణ, బాలరాజు, రామచంద్రము తదితరులు పాల్గొన్నారు.