15వ ఆర్థిక సంఘం నిధుల నుండి సిసి రోడ్ల ప్రోసిడింగ్ అందజేత

Published: Wednesday June 02, 2021
పరిగి, జూన్ 1, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిదిలోని 8 గ్రామాలకు 15 వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ప్రతి గ్రామానికి రెండు లక్షల చొప్పున సిసి రోడ్ల ప్రోసిడింగ్ లను ఎంపిటిసిలకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్ రావు, జెడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యం, సుల్తాన్ పూర్ ఎంపిటిసి వెంకటరామిరెడ్డి, తెరాస సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి  పాల్గొన్నారు.