ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాం

Published: Monday November 07, 2022

వికారాబాద్ బ్యూరో 6 నవంబర్ ప్రజా పాలన : వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని 5వ కౌన్సిలర్ పలుగుట్ట ప్రవళిక కృష్ణ అన్నారు. ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 5వ వార్డుకు చెందిన కొత్రేపల్లిలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ఆర్థిక నిధులతో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కౌన్సిలర్ పలుగుట్ట ప్రవళిక కృష్ణ మాట్లాడుతూ బక్క అంతయ్య ఇంటి నుండి బక్క నరసయ్య ఇంటి వరకు దొడ్ల శివరాములు ఇంటి నుండి ప్రాథమిక పాఠశాల వరకు సిసి రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. వార్డు పురోగతి సాధించాలంటే రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండాలని చెప్పారు. ఇండ్ల మధ్యలో పిచ్చి మొక్కలు పెరగకుండా గడ్డి మందును పిచికారి చేయిస్తున్నామని వివరించారు. పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని వెల్లడించారు. త్వరలో కొత్రేపల్లిలో స్మశాన వాటిక అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలుగుట్ట నర్సింలు బి నర్సింలు యాదగిరి సంధ్యారాణి గ్రామ కొత్రేపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.