ధ్వజస్తంభ ప్రతిష్ఠ శ్రీ సీతారాముల కల్యాణం

Published: Monday June 21, 2021

వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పున: నిర్మాణంలో భాగంగా ఆదివారం శ్రీదండి రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణనంతరం తలంబ్రాల వేడుక భక్తుల కరతాళ ధ్వనుల మధ్య కన్నుల పండువగా సాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి వైస్ ఎంపీపీ బాతరాజు ఉమాబాల నరసింహ సోలిపురం శ్రీకాంత్ రెడ్డి కలిసి కళ్యాణ వేడుకను తిలకించారు. అర్చకులు కారంపూడి నరసింహాచార్యులు మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ మీసాల శేఖర్, ఉపసర్పంచ్ సోలిపురం అరవింద్ రెడ్డి, ఆలయ చైర్మన్ కళ్లెం బుచ్చిరెడ్డి, గూడూరు రాoరెడ్డి, సోలిపురం జనార్దన్ రెడ్డి, కళ్లెం బలరాం రెడ్డి, గంధమల్ల బాలయ్య, దానయ్య, ముత్యాలు, ఆలయ కమిటీ సభ్యులు  వార్డు మెంబర్లు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.