సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు మధిర రూరల్

Published: Thursday February 02, 2023

 ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధిమధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను మాటూరుపేట గ్రామంలో బాధితుడు ముదిగొండ సుబ్బయ్యకు వారి ఇంటి వద్ద న్యాయవాది నెల్లూరి రవి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తలపురెడ్డి కృష్ణారెడ్డి చేతుల మీదగా అందించారు. ఈ సందర్భంగా బాధితుడు ముదిగొండ సుబ్బయ్య మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పంపిణీ కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షుడు చిలువేరు బుచ్చిరామయ్య, కరణం పురుషోత్త, ముదిగొండ సతీష్, ముదిగొండ వెంకట్ నారాయణ, దనిశెట్టి అప్పారావు,రెంటపల్లి శ్రీనివాసరావు, చిలువేరు శాంతయ్య ఉన్నారు.