బెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ గా రాచర్ల సంతోష్ నియామకం
Published: Tuesday September 20, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గ బిజెపి పార్టీ కన్వీనర్ గా పట్టణానికి చెందిన రాచర్ల సంతోష్ ను నియమించినట్లు రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కన్వీనర్ గా రాచర్ల సంతోష్ సంయుక్త కన్వినరుగా మాజీ కౌన్సిలర్ రాజు లాల్ యాదవ్ లను నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్వీనర్ గా, సంయుక్త కన్వీనర్ గా, పదవులు రావడానికి సహాయపడిన పార్టీ పెద్దలందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు, ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ బిజెపి పార్టీని నియోజకవర్గంలోని గడపగడపకు తీసుకు వెళ్తామని వారు తెలిపారు.
Share this on your social network: