ఈద్గా మజీద్ స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : మైనార్టీ ముస్లిం నాయకులు

Published: Thursday September 23, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 22 (ప్రజాపాలన) : జిల్లా కేంద్రంలోని నూర్ నగర్ కాలనీలో ఉన్న ఈద్గా, మజీద్ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ ఏజాజ్ ఖాన్ కు మైనార్టీ ముస్లిం నాయకులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మైనార్టీ ముస్లిం నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఆ స్థలములో నమాజ్ కు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగించడం జరుగుతుందని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి కబ్జా దారుల ను తొలగించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో మైనార్టీ ముస్లిం నాయకులు ఉబెద్ బిన్ యాహియ, అబ్దుల్ రెహమాన్, సమి, గౌస్, షాహిద్, సలీం, అబ్దుల్లా, జావిద్,తదితరులు పాల్గొన్నారు.