చందానగర్ ను కరోనా రహిత డివిజన్ గా తీర్చిద్దాడమే లక్ష్యం

Published: Friday May 28, 2021
- మంజుల రఘునాథ్ రెడ్డి
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా రహిత డివిజన్ గా తీర్చిద్దాడమే లక్ష్యంగా వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా పలు రంగాల్లో పనిచేస్తున్న వారిని సుపర్ స్పైడర్ లుగా గుర్తించి వారికి వాక్సినేషన్ ప్రక్రియను చేపట్టామని కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గురువారం చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని స్ట్రీట్ వేండర్ లకు కరోనా వాక్సిన్ రిజిస్ట్రేషన్ పక్రియ చేపట్టడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ చేపట్టడం జరుగుతుందని, సుపర్ స్పైడర్ రంగాల్లో ఉన్న వారు వెంటనే వాక్సిన్ రిజిస్ట్రేషన్ పక్రియలో పాల్గొని వాక్సినేషన్ పక్రియ విజయవంతం చేయాలని కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి  తేలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, జిహెచ్ఎంసి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.