రైతుల అభ్యున్నతికి నిరంతరం కృషి* *చేవెళ్ల మార్కెట్ కమిటీ ఛైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి

Published: Friday December 02, 2022
చేవెళ్ల నియోజకవర్గం:చేవెళ్ల:(ప్రజాపాలన):
 రైతుల అభ్యున్నతికి  నిరంతరం కృషి చేస్తానని చేవెళ్ల మార్కెట్ కమిటీ ఛైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి తెలిపారు.గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ సాదారణ సమావేశం నిర్వహించి పలు తీర్మానం చేశారు
ఈ సందర్భంగా........ మాట్లాడుతూ....
రైతులకు నిత్యం అందుబాటులో ఉండి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నానని తెలిపారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రైతు రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ పద్దతులు ఇతర దేశాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మార్కెట్‌ కమిటీల అభివృద్దికి చేయూతనందిస్తుందని తెలిపారు. కేసీఆర్ సర్కారు హయాంలో రైతే రాజుగా వెలుగొందుతున్నారు. 
ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ పాలకవర్గం మంచి నిర్ణయం తీసుకుందని,మార్కెట్ కు వచ్చే రైతులకు తాగునీరు,మరుగుదొడ్లు వంటి సదుపాయాలు కల్పించేందుకు తీర్మానం చేయడం జరిగిందన్నారు.ఈ సమావేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొని నూతన పాలకవర్గాని శాలువాతో సన్మానించారు.అలాగే పలు సూచనలు,సలహాలు అందించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి. నర్సింలు చేవెళ్ల PACS చైర్మన్ దేవర వెంకటరెడ్డి.డైరెక్టర్లు సుమలత,తెలుగు వెంకటేష్ ముదిరాజ్,బూర్ల మహేష్,తిరుపతి రెడ్డి,కరుణాకర్ రెడ్డి,వెంకటేష్,సతీష్,చంద్రశేఖర్ రెడ్డి,కృష్ణ నాయక్,ఫయాజుద్దీన్  కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.