27వ డివిజన్ లో 15 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Published: Friday August 20, 2021
బాలాపూర్: ఆగస్టు19, ప్రజాపాలన ప్రతినిధి : పలు డివిజన్లలో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులు చేయడమే ముఖ్య లక్ష్యం మనీ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి ఆధ్వర్యంలో 15 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పైప్లైన్ ను కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ..... ప్రతి డివిజన్లో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తవుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ ముడావత్ దుర్గా దీప్ లాల్ చౌహన్. డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి. బిజెపి ఫ్లోర్ లీడర్ కిసర గోవర్ధన్ రెడ్డి. కార్పొరేటర్లు. పెండ్యాల నరసింహ్మ, కీసర హరినాథ్ రెడ్డి, భీమ్ రాజ్, మల్లేష్, భాస్కర్, శీను, రాజు, గోపాల్, రంగమ్మ, వనిత, మౌనిక, కవిత, కాలనీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.