డ్రైనేజ్ పైప్ లైన్లో నాణ్యత లోపించకుండా చూడాలి

Published: Thursday May 27, 2021
మేడిపల్లి, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి) : డ్రైనేజ్ పైప్ లైన్లో నాణ్యత లోపించకుండా చూడాలని కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు అధికారులకు సూచించారు.రామంతాపూర్ డివిజన్లోని బగాయత్ సాయి క్రిష్ణ కాలనీలో యూ జిడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతుండడంతో అక్కడి కాంట్రాక్టరు నాణ్యత పాటించకపోవడంతో కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్ జలమండలి అధికారులను జిఎం ఎం శ్రీధర్ రెడ్డి, మేనేజర్ సాయిబాబాను పిలిచి వారితో పర్యటించి అక్కడ నడుస్తున్న పనులను పర్యవేక్షించి డ్రైనేజ్ లైన్ నాణ్యత లోపించకుండా చూడాలని ఇప్పటివరకు జరిగిన పని నాణ్యతతో పునరుద్ధరణ చేయాలని కార్పొరేటర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాయి క్రిష్ణ కాలనీ వాసులు పరశురాం, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీకాంత్, జలీల్, ప్రతాప్, చారి, శ్రీను, మహేష్, నరసింహ, మిశ్రా, సాయిబాబా, బాలకృష్ణ, రాజు, చారి మరియు బిజెపి నాయకులు డివిజన్ బిజెపి ప్రెసిడెంట్ బండారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, తిరుపతయ్య, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.