రేవంత్ రెడ్డిని కలిసిన పరమేశ్వర్ రెడ్డి
Published: Monday September 06, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 5 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ఉప్పల్ కాంగ్రెస్ నేత మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి ఆదివారం కలిశారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఇటీవల చేపట్టిన దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమం, ప్రజల నుండి వచ్చిన స్పందన గురించి వివరించారు. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాలలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్టుగా చెప్పారు. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చిన చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Share this on your social network: