వరద ముంపు కాలనీ కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ
Published: Thursday October 07, 2021
మేడిపల్లి, అక్టోబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) హబ్సిగూడ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ద చిల్డ్రన్ ఇండియా విత్ కొలాబరేషన్ వర్జన్ సి ఐ ఎస్ ఎస్ కన్సల్టెన్సీ వారి సహకారంతో స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతనహరీష్ సహాయంతో రామంతాపూర్ పెద్ద చెరువు వరద ముంపు కాలనీ సాయిచిత్ర నగర్లో నివసిస్తున్న పేద కార్మికులు దాదాపు 80 కుటుంబాలకు తమ వంతు సహాయంగా ప్రతి కుటుంబానికి 20 కేజీల బియ్యం, పప్పు, మిరప్పొడి, నూనె, పంచదార, పసుపు వంటి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్పొరేటర్ చేతన హరీష్ మాట్లాడుతూ పేద ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మంచి పౌష్టికాహారాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవ్ ద చిల్డ్రన్ ఇండియా విత్ కొలాబరేషన్ వర్జిన్ సి ఐ ఎస్ ఎస్ కన్సల్టెన్సీ సభ్యులు ప్రభాకర్, రవికిరణ్, స్వాతి, కాలనీవాసులు భరత్, వేముల కొండ వెంకన్న గౌడ్, బీజేపీ నాయకులు సంజయ్ పటేల్, న్యాలకొండ సుమన్ రావు, చింతకింది ప్రవీణ్, ఎల్లాచారి, లక్ష్మీ పాల్గొన్నారు.
Share this on your social network: