20వ డివిజన్ లో ఐదు లక్షల వ్యయంతో పహరి గోడ నిర్మాణం

Published: Tuesday September 21, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : దశల వారీగా అభివృద్ధి జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ కార్పొరేటర్ మద్ది సబిత రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి నగర్ లో 5 లక్షల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణం కొరకు సోమవారం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ డిప్యూటీ మేయర్ లు మాట్లాడుతూ... ప్రతి కాలనీలో దశల వారీగా అభివృద్ధి చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ... వర్షాకాలంలో  కాలనీవాళ్లు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా డ్రైనేజ్ మెయిన్ వాల్స్ రిపేర్ వర్కు చేయించడం, అన్ని మెయిన్ వాల్స్ క్లీన్ చేయించిన కార్పొరేషన్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేషన్ డి ఈ గోపీనాథ్, ఏ ఈ శ్రీనివాస్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి, దిప్ లాల్ చౌహన్, కాలని పెద్దలు ప్రభాకర్, అప్పారావు, నరసింహారెడ్డి, సురేందర్, భరత్, శ్రీనివాస్, రమేష్, వీర్రాజు, ప్రవీణ్ రెడ్డి, వంశి బాబు, మహిళా మణులు, మాలతీ, నలిని, రాజేశ్వరి, పద్మజ, తదితరులు పాల్గొన్నారు.