వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి మధిర సెప్టెంబర్ 12 ప్రజాపాలన

Published: Tuesday September 13, 2022

మధిరలో విలేకరుల సమావేశంలోమాా

పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ రాష్ట్రంలో ముందుగా ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తానని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మున్సిపాలిటీీ పరిధిలో డాక్టర్ కోటా రాంబాబు నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా తాను పోటీలో ఉంటానని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానన్నారు. జిల్లాలో పాదయాత్ర చేసే అవకాశం ఉందా అని విలేకరుల ప్రశ్నించగా,  నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారని, అధికార పార్టీలో ఉండి పాదయాత్ర చేయటం సమంజసం కాదన్నారు ఆయన తెలిపారు మండలం పరిధిలో పలువురు ఇంటికి వెళ్లి పరామర్శలు చేసి నేను ఉన్న మీ వెంట   మీఅండగా ఉంటారని ఉత్సాహంగా అందరిని పలకరిస్తూ మనోధైర్యం తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కె వి ఆర్ హాస్పిటల్ అధినేత కోట రాంబాబు అప్పారావు రమేష్ చావల్ రామరాజు దేవి శెట్టి రంగా లక్ష్మారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు