గురువులకు పాదాభివందనం

Published: Monday September 06, 2021
మధిర, సెప్టెంబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శ్రీ కంభంపాటి పురుషోత్తమ రావు గారికి చిరు సన్మానం చిన్ననాటి గురువులు గౌరవనీయులు శ్రీ కంభంపాటి పురుషోత్తమ రావు చిన్ననాటి ప్రైమరీ స్కూల్ శిష్యులు మధిర నడిబొడ్డున గల సి పి ఎస్ బడి నందు విద్యను అందించిన మా "గురువు" గారు చదువుతో పాటు గుణాన్ని జ్ఞానాన్ని అందించిన "సద్గురువు" లైన పురుషోత్తమ రావు గారు ఎందరెందరినో ఉన్నతస్థాయిలో తీర్చిదిద్ది తాను మాత్రం అదే స్థానంలో ఉంటూ ఆనంద పడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానాన్ని బాధ్యతగా చేపట్టిన వారికి ఈరోజు గౌరవ ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు "శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు" సందర్భంగా వారికి దుశ్శాలువతో సత్కరించి వారికి స్వీట్స్, పండ్లు అందజేసి ఆశీస్సులు పొందినాముఈ సందర్భంగా గురువు గారితో పాతకాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తోటి గురువులను కూడా మననం చేస్తూ ఆనంద వ్యక్తపరిచినాము ఈ సందర్భంగా గురువు గారినుండి ఆశీస్సులు పొందిన శిష్యులు యర్రా లక్ష్మణ్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్, భైరవబోట్ల శ్రీనివాసరావు న్యాయవాది కోమటిడి శ్రీనివాసరావు సేవాతత్పరుడు, కాజా శ్రీనివాసరావు వ్యాపారవేత్త, కోమటి సుధాకర్ జ్యోతిష్యం, వాస్తు, రెమిడీ కన్సల్టెంట్ శ్రీ గాయత్రి టైలర్స్, పాల్గొన్నారు