కాంట్రాక్టు అధ్యాపకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
Published: Thursday March 10, 2022
బోనకల్, మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా 11,103 కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రకటించడం పట్ల కాంట్రాక్ట్ అధ్యాపకులకు చాలా సంతోషదాయక అని, ఈ సందర్భంగా సీఎం కెసిఆర్, ఆర్థిక వైద్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావుకి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మాకు సహకరించిన అనేక మంది పెద్దలకు, మేధావులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల బోనకల్ కాంట్రాక్టు అధ్యాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు అంతోటి తిరుపతిరావు, ఉన్నం రామకృష్ణ, డి.పద్మావతి, ఎ.రాజేంద్ర కుమార్, పి.లక్ష్మీకాంతం, యస్ రాజేంద్ర, ఎమ్.రమేష్, ఎ మురళి కృష్ణ, జి.ధనలక్ష్మి, జి.ప్రేమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Share this on your social network: