కరెంట్ అధికారి ఏ.ఈ కి డీడీ రూపంలో అందజేశారు

Published: Tuesday May 04, 2021
బాలపూర్, మే 3, ప్రజాపాలన ప్రతినిధి : జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ నుండి టాటా ఏరోస్పేస్ వరకు స్ట్రిట్  లైట్స్ కు ఎలక్ట్రిషన్ వైరింగ్ చేయాలని కరెంటు అధికారి అయినటువంటి ఏ.ఈ తాజుద్దీన్ కి నాదర్గుల్ బిజెపి నేతలు అందజేశారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ 9వ 27వ డివిజన్ లోని  జెడ్. పి. హెచ్. ఎస్ పాఠశాల మెయిన్ రోడ్డు నుండి టాటా ఏరోస్పేస్ వరకు బడంగ్ పేట్ కార్పొరేషన్ బార్డర్ వరకు స్ట్రీట్ లైట్స్ సంబంధించిన ఎలక్ట్రిషన్ వైరింగ్కు కావాల్సిన 3,75,216 లక్షల రూపాయల చెక్కును డిడి రూపంలో కరెంట్ అధికారి అయినటువంటి ఏ.ఈ తాజుద్దీన్ కి నాదర్గుల్ గ్రామ బిజెపి  స్థానిక కార్పొరేటర్లు కలిసి సోమవారం నాడు అందజేస్తూ, అనంతరం వారు మాట్లాడుతూ.... ఈ పనులు తొందరలో పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఏ ఈ తాజుద్దీన్ వెంటనే స్పందించి కరెంట్ అధికారులకు పనులు ప్రారంభించమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ గూడెపు ఇంద్రసేన, తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, 27 వ డివిజన్ కార్పొరేటర్ తోట శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.