TS RTC మధిర డిపో పరిధిలోని ప్రయాణికులకు మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త

Published: Thursday October 07, 2021

మధిర, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : దసరా పండుగ సందర్భంగా హైదరాబాదుకు వెళ్ళు ప్రయాణికులు కనీసం 30 మంది కంటే ఎక్కువ మంది ఉన్నట్లయితే బస్సు నేరుగా మీరు ఉన్న చోటికి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ సదవకాశాన్ని రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, కాలనీవాసులు, గురుకుల పాఠశాల విద్యార్థులు, వలస కార్మికులు, ఉమ్మడి కుటుంబ సభ్యులు, పరిసర గ్రామ ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొనగలరని తెలియజేయుచున్నాము. ప్రయాణ ఛార్జీలు, బస్సుల వేళలు తదితర విషయాలపై మధిర డిపో మేనేజర్ శ్రీ ఎస్ దేవదానం 99 59 22 59 61, ట్రాఫిక్ ఇంచార్జ్ శ్రీ వనమా నరసింహారావు గారిని 70 32 8 9 39 93 సంప్రదించగలరు అని డిపో మేనేజర్ శ్రీ.ఎస్.దేవదానం తెలియ చేసారు.