పారిశుధ్య కార్మికులకు ఫేస్ షీల్డ్ పంపిణీ

Published: Friday May 21, 2021

మంచిర్యాల టౌన్, మే20, ప్రజాపాలన : మంచిర్యాల పట్టణం వార్డ్ 15 బిజెపి నాయకులు ఆకుల సంతోష్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు ఫేస్ షీల్డ్ మరియు శానిటైజర్ లు అందజేసిన బి జె పి నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు ఫేస్ షీల్డ్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పట్టి ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడుతున్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో మంచిర్యాల పట్టణంలోని అన్ని వార్డులోని మున్సిపల్ కార్మికుల రక్షణ కోసం మాస్క్ కు, ఫేస్ షీల్డ్ మరియు శానిటైజర్ లు అందజేస్తామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఆకుల సంతోష్, సాతిని రాజు, నాగరాజు, అన్వేష్, పట్టి వెంకట రమణ, జాడి సత్యనారాయణ, పల్లి రాకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.