మున్సిపల్ పరిధిలో కొత్త అభివృద్ధి పనులను చేపట్టాలి

Published: Wednesday December 07, 2022
మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ
వికారాబాద్ బ్యూరో 6 డిసెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ మునిసిపల్ పరిధిలో కొత్త ప్రతిపాదనలతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్  డైరెక్టర్ సత్యనారాయణ సంబంధిత అధికారులను సూచించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, పబ్లిక్ హెల్త్ ఇ యన్ సి, ఎస్ ఇ లతో కలసి వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికారాబాద్ మున్సిపల్ పరిధిలో కొత్త ప్రతిపాదనలతో రోడ్డు వైడెనింగ్, సెంట్రల్ లైటింగ్ పనులతో పాటు జంక్షన్ ల వద్ద అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు.  కొత్త డివైడర్లు, రైల్వే వంతెన, అర్బన్ పార్క్ అభివృద్ధితో పాటు జంక్షన్ ల వద్ద ఉన్న పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు.  శివసాగర్ చెరువు బండు అభివృద్ధి పనులు చేపట్టి వికారాబాద్ పట్టణాన్ని అందంగా తీర్చి దిద్దినన్నట్లు ఆయన తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఇట్టి పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. జిల్లాలో ఇప్పటివరకు అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ యార్డులు, వైకుంఠధామాల పనులను ఫిబ్రవరి మాసంతం వరకు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పెంచాలన్నారు.   గ్రీన్ బడ్జెట్ వినియోగించి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మున్సిపల్ డీఇ, ఏఇ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.