ఎస్సారెస్పీ ఆర్ 3 కెనాల్ కు గండి : జడ్పీ చైర్ పర్సన్ వసంత కు విన్నవించిన గ్రామస్తులు
Published: Tuesday March 30, 2021
జగిత్యాల, మర్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల మండలం మోరపల్లి గ్రామానికి చెందిన ఎస్సారెస్పీ ఆర్ 3 కెనాల్ కు గండి పడడంతో గ్రామానికి ప్రమాదం పొంచి ఉండడంతో గ్రామ రైతులు జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతను కలిసి విన్నవించగా వెంటనే స్పందించి చైర్ పర్సన్ జిల్లా కలెక్టర్ రవికి ఫోన్ చేసి సమస్యను వివరించారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడడంతో మోరపల్లి గ్రామానికి వెళ్లే కెనాల్ నీటి మట్టాన్ని తగ్గించారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని మోరపల్లి గ్రామస్థులు జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేశ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this on your social network: