ఆదినారాయణ స్మారకార్థం అన్నదానం

Published: Friday May 21, 2021

బెల్లంపల్లి, మే 20, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణా మాల మహానాడు సీనియర్ నాయకులు స్వర్గీయ మిరియాల ఆదినారాయణ స్మారకార్థం పట్టణంలోని పలువురికి భోజనం పంపిణీ చేసినట్లు స్థానిక మాలమహానాడు నాయకులు తెలిపారు. ఇటీవల మృతి చెందిన మాల మహానాడు నాయకుడు మిరియాల ఆదినారాయణ స్మారకార్థం గురువారం నాడు స్థానికంగా వివిధ బస్తీలలో ఉన్న యాచకులకు మరియు  ఏరియా ఆసుపత్రిలోని కోవిడ్ బాధితుల కుటుంబ సభ్యులకు  భోజనాలను అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్రప్రధాన కార్యదర్శి కుసుమ మధుసూదన్, రాష్ట్ర యువజన అధ్యక్షులు ఆసాది మధు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్, మాల మహానాడు సీనియర్ నాయకులు బడికెల రమేష్, ఎలుక ఆకాష్, మారేడి ఉదయ్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.