బి ఎస్ పి ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం నిత్యావసర వస్తువుల పై పెంచిన ఛార్జీలు తగ్గి

Published: Saturday June 18, 2022
బోనకల్, జూన్ 17 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రం లో శుక్రవారం ప్రభుత్వ పనితీరుపై నిరసన తెలుపుతు పెంచిన ఆర్,టి,సి, ఛార్జీలు , విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని,
డీజిల్ పెట్రోల్ నిత్యావసర సరుకులపై పెంచిన రేట్లు తగ్గించాలని, బాసరలో ఐ ఐ ఐ టి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చెయ్యాలని, ప్రభుత్వం పట్ల నిరసనగా కే సీ ఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, మధిర అసెంబ్లీ అధ్యక్షుడు పల్లెపొంగు విజయ్ కుమార్, మధిర అసెంబ్లీ ఇంచార్జ్ మిరియాల నాగరాజు, మధిర అసెంబ్లీ ఉపాధ్యక్షుడు దామెర్ల పృద్వి వారియర్, బోనకల్ మండల అధ్యక్షుడు గంధం వంశి, చింతకాని మండల అధ్యక్షుడు దారెల్లి రమేష్ ,బోనకల్ మండల ఉపాధ్యక్షుడు అంతోటి శివకృష్ణ, ఖమ్మం జిల్లా ఐ టి సెల్ అధ్యక్షుడు కనక పూడి కళ్యాణ్, ఇరుగు నవీన్ ,కనకపూడి నాగేశ్వరరావు,కనకపూడి వెంకటేశ్వర్లు, బి ఎస్ పి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.