స్వామి అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు ఆభరణ దర్శనం జ్యోతి దర్శనం

Published: Monday January 16, 2023
మధిర రూరల్  జనవరి 14(ప్రజాపాలన ప్రతినిధి ప్రతిని) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో శనివారం నాడు జరిగిన భోగి ఉత్సవాలు ఉదయాన్నే స్వామి అభిషేకాలు ప్రత్యేక పూజల్లో చలవాది ధర్మారావు శ్రీనివాసరావు  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి బోగి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అయ్యప్ప స్వామి భక్తులకు,ఏర్పాటుచేసిన సాయంత్రం పూట లో స్వామివారి ఆభరణం ఉత్సవం చలవాది ధర్మారావు శ్రీనివాసరావు వారి ఇంటి దగ్గర నుండి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం కు ఊరేగింపు బయలుదేరి భక్తులు భజన కార్యక్రమం తో మేళ తాళాలతో స్వామివారి ఊరేగింపు కనుల పండగ శ్రీ ధర్మశాస్త్ర స్వామి దేవాలయానికి చేరుకొని స్వామివారి అలంకరణతో ఆభరణ దర్శనం భక్తులకి దర్శనమిచ్చిన స్వామి అయ్యప్ప అనంతరం సాయంత్రం 6:40 నిమిషాలకు జ్యోతి దర్శనం భక్తులు మధ్య దర్శనం ఇచ్చిన స్వామి అయ్యప్ప జ్యోతి దర్శనం అనంతరం పెద్ద ఎత్తున శరణు ఘోషతో మారు బోగినం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం భక్తులకు బిక్ష ఏర్పాటు చేసి స్వామి తీర్థప్రసాదాలు అందించారు   . ఈ సందర్భంగా చలవాది ధర్మారావు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులుమాట్లాడుతూ స్వామివారి జ్యోతి దర్శనం ఆభరణం దర్శనం భక్తులు చేసుకొని భక్తులకు స్వామి అయ్యప్ప దీవెనలు పొంది స్వామి కృపకు పాత్ర అయ్యారని వారు తెలిపారు అనంతరం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు సేవ చేసిన వారందరికీ పేరుపేరునా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి స్వామి దీవెనలు ఉండాలని అదేవిధంగా ప్రతి బుధవారం స్వామివారి దేవాలయంలో భజన కార్యక్రమం ఉంటుందని అనంతరం భిక్ష ఏర్పాటు చేయుట ఉంటుందని దీన్ని కూడా ప్రతి ఒక్కరు స్వామికి సేవ చేసి భజన పాల్గొని స్వామి అయ్యప్ప కృపకు పాత్ర కాగలరు  ఈ కార్యక్రమంలో గురుస్వామి దేవిశెట్టి రంగారావు పుల్లారావు నాగభూషణం సుబ్బారావు రమేష్ గాంధీ శ్రీనివాస్ కాశి వంకరపాటి నాగేశ్వరావు బాబు మేడం వెంకటేశ్వర రావు మైనీడి జగన్మోహన్ రావు స్వామి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు అర్చకులు, వారి కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొని ఈ కార్యక్రమానికి దిగ్విజయంచేశారు