కాంగ్రెస్ అడ్డా మునుగోడు గడ్డ

Published: Thursday October 20, 2022
 వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 19 అక్టోబర్ ప్రజా పాలన : గెలుపే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తూ మునుగోడు గడ్డపై కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు మండల పరిధిలోని కొంపల్లి గ్రామంలో ఉన్న టిపిసిసి అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డిని టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డిలను వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ద సుధాకర్ రెడ్డితో పాటు కౌన్సిలర్ జైదుపల్లి మురళి కాంగ్రెస్ నాయకులు రెడ్యానాయక్, దోమ శ్రీధర్, రామకృష్ణా రెడ్డి, చాపల శ్రీనివాస్ ముదిరాజ్, వినోద్, విజయ్ కుమార్, నరేందర్, కరీం, మహేష్ మురళి, విష్ణు లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడులో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి పనులే విజయాన్ని సాధించి పెడతాయని భరోసా వ్యక్తం చేశారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామ ప్రజలు ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ బిజెపి పార్టీలను ఓటర్లు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ప్రతి ఓటరు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తున్నారని అన్నారు.