విత్తన దుకాణాలపై తనిఖీలు చేపట్టిన వ్యవసాయ శాఖ..

Published: Tuesday June 28, 2022
పాలేరు జూన్ 27 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి మండలం నందు విత్తనముల దుకాణములను కే నారాయణరావు మండల వ్యవసాయ అధికారి, నెలకొండపల్లిలో తనిఖీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జి. స్రవంతి రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీలో డీలర్ల వద్ద గల స్టాక్ రిజిస్టర్లు మరియు నిల్వలను పరిశీలించినారు. అదే విధంగా ప్రతి డీలరు ఆత్వికృత కంపెనీల నుండి నాణ్యమైన విత్తనాలను తెప్పించి విక్రయించాలని ఆదేశించినారు. అదేవిధంగా ప్రతీ డీలరు స్టాక్ వివరాలు ప్రతీ రోజూ నమోదు చేయాలని తెలియచేసినారు. ప్రతీ డీలరు రైతుకు తప్పని సరిగా బిల్లు ఇవ్వాలని ఆదేశించినారు. విత్తనముల విక్రయంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా చట్టరిత్యా చర్యలు తీసుకొనబడతాయని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ రాఘవయ్య, మరియు సిబ్బంది. మజీద్, సైదయ్య, శ్రీనివాసదాసు
వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు