బీజేపీ నాయకుల అసత్య ప్రచారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు

Published: Friday May 28, 2021
మేడిపల్లి, మే27 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై బీజేపీ నాయకుల అసత్య ప్రచారాలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గడ్డం రవికుమార్ మాట్లాడుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై వచ్చిన భూవివాదం ఆరోపణలపై ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో బురద జల్లడం సమంజసం కాదని తెలిపారు. విచారణ జరగకుండా అన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తయ్యాక మూల్యం చెల్లించుకోక తప్పదని గడ్డం రవి కుమార్ హెచ్చరించారు. కొంతమంది బీజేపీ నాయకులు కోర్టు విచారణ పరిధిలో ఉన్న అంశాన్ని పక్కనబెట్టి ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలని అవినీతి  పరులను సస్పెండ్ చేయాలని పదే పదే ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు. మాజీ ఉప్పల్ ఎమ్మెల్యేే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆయన ఉన్న ఆఫీస్ రోడ్డును కబ్జా చేసి ఆఫీస్ కట్టుకున్నాడని, కబ్జా అనే ఆలోచన వచ్చేది మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ కి  ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కబ్జాలు చేశాడు. పదేపదే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ఎమ్మెల్యే ను నిందించడం తగదు అని అన్నారు. ఇదే విధంగా చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కబ్జా చేసి నట్టు ఆరోపణలు ఉంటే మాజీ ఎమ్మెల్యే ఆస్తులను బేతి సుభాష్ రెడ్డి ఆస్తులను బేరీజు వేస్తే ఆస్తులు పెరిగాయా తగ్గాయా తెలుస్తుందన్నారు. ఈ  కార్యక్రమంలో టీీఆర్ఎస్ నాయకులు, ఉప్పల్  మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు గరికె సుధాకర్, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి, కృష్ణారెడ్డి, సూరం శంకర్, జెసిబి రాజు, ముత్యంరెడ్డి, నంది కండి శివ తదితరులు పాల్గొన్నారు.