భక్తాంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రామ్మూర్తి నాయక్..

Published: Monday November 14, 2022
తల్లాడ, నవంబర్ 13 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని అంజనాపురం గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయం పక్కన నూతనంగా నిర్మించిన భక్తాంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంకును కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు ధరావత్ రామ్మూర్తి నాయక్, కాపా వెంకటేశ్వర్లు, టీపీసీసీ నాయకులు కొటారి మానవతారాయ్ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న బంకును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తహాసిల్దార్ హర్ సింగ్, మాజీ సర్పంచ్ రామ్ చంద్ర నాయక్, అంజనాపురం సర్పంచ్ కొమ్మినేని ప్రభాకర్ రావు, నాయకులు కేతినేని చలపతి, కాపా సుధాకర్, దీవెల కృష్ణయ్య, ఎంపిటిసి రుద్రాక్ష బ్రహ్మం, ఇంజం కృష్ణార్జునరావ్, తదితరులు పాల్గొన్నారు.