అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించిన కామ్రేడ్ తాండ్ర కుమార్
శేరిలింగంపల్లి - ప్రజాపాలన/ న్యూస్ శేరిలింగంపల్లి ఎంసిపిఐయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. తాండ్ర కుమార్ మరణం కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఆయా పార్టీల నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతోమంది పేద వారిని ఆదుకుని వారికి గూడు నీడ ఏర్పాటు చేశారు ఆయన మహోన్నత వ్యక్తి సమాజ సేవకై పాటుపడిన మహానుభావుడు ప్రతినిత్యం పేదవారి కోసం పాటుపడే వ్యక్తి పేద వారి కోసం లాఠీ దెబ్బలను లెక్క చేయకుండా ఎదురు నిలబడిన కామ్రేడ్ ఎర్ర చుక్క సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు బాగ్ లింగంపల్లిలోని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్ లో ప్రజల దర్శనార్థం కామ్రెడ్ తాండ్ర కుమార్ భౌతిక దేహాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముజాఫ్ఫర్ నగర్ ఆఫీస్ వద్దకు తీసుకెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి రేపు ఉదయం అంత్యక్రియలు అయ్యేవరకు మియాపూర్ ని వారి ఇంటి వద్ద మృతదేహం ఉంచబడును.15వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన స్వస్థలమైన మియాపూర్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.
Share this on your social network: