పోల్కంపల్లిలో విద్యార్థులకు కరోనా పరీక్షలు

Published: Tuesday November 23, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రాహీంపట్నం మండలం పొల్కంపల్లి పాఠశాలలో కోవిడ్ కేసు నమోదు అయినందున సోమవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సోమవారం రోజు కోవిడ్  ఆర్టిపిసిఆర్ టెస్టులు నిర్వహించడం జరిగింది. శనివారం పాఠశాల విద్యార్థికి పాజిటివ్ వచ్చి వారి కుటుంబ సభ్యులకు కూడా వచ్చినందున, సోమవారం ఉదయం పాఠశాలను రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఉప వైద్యాధికారిని నాగజ్యోతి, దండుమైలారం ప్రాధమిక అరోగ్య కేంద్రం వైద్యులు అభిరామ్ సందర్శించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. జ్వరం, జలుబు లాంటి లక్షణాలు కనిపించిన విద్యార్థులు ఎవరైనా ఉంటే అలాంటి విద్యార్థులను ఇంటివద్దనే ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలలో ఎవరికీ పాజిటివ్ రాలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింహ్మా రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బత్తుల శ్రీనివాస్ రెడ్డి, పట్నం కృష్ణ, కిరణ్ కుమార్, దండు మైలారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.