బ్లాక్ పంగస్ తో మృతి చెందిన తహశీల్దార్ కుటుంబాన్ని ఆదుకోవాలి - ఎల్. రమణ
Published: Wednesday May 26, 2021
జగిత్యాల, మే 25 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల్ తహశీల్దార్ అనుమల్ల రాజేశ్వర్ (55) మృతికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ సంతాపాన్ని తేలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర రెవెన్యూ మంత్రి తహసీల్దార్ అనుమల్ల రాజేశ్వర్ కరోనా ఫ్రాంట్ లైన్ వారియర్ గా పని చేస్తూ అదే కరోనా వ్యాధికి గురై కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ వలన సోమవారం రోజున మరణించడంతో చింతిస్తున్నాం అని అన్నారు. బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వ్యాధికి అయిన ఆసుపత్రి ఖర్చులు రియంబర్స్ మెంట్ త్వరగా మంజూరు చేయాలని బాధిత కుటుంబంలో ఒకరికి సమాన హోదా కలిగిన ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎల్.రమణ కోరారు. రాజేశ్వర్ కుటుంబ సభ్యులకు ఫోన్ లో ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Share this on your social network: