అమరుల త్యాగాలు మరువలేనివి

Published: Wednesday June 30, 2021

జన్నారం, జూన్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రానికి చెందిన సిపిఎం పార్టీ నాయకులు కనికరం రాజన్న పోతు శంకర్ కరోనాతో మృతి చెందగా వారి కుటుంబాలను మంగళవారం సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొజ్జా బిక్షమయ్య పరామర్శించారు, వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజన్న శంకర్ ఈ ప్రాంత పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తులు అని ఎందరికో పేదవారికి భూములు ఇప్పించారని వారు ప్రజల మధ్య లేకపోవడం చాలా బాధాకరం అన్నారు