ఓట హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మొండితోక

Published: Wednesday February 24, 2021

మధిర, ఫిబ్రవరి 23, ప్రజాపాలన: వచ్చే నెల 14న జరిగే MLC ఎన్నికల్లో విద్య వంతులు స్వేచ్ఛగా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని మధిర మునిసిపాలిటీ పరిధి లో 12 వ వార్డు లో మాజీ మునిసిపాలిటీ చైర్పర్సన్  మొండితోక నాగరాణిసుధాకర్ గారు అన్నారు. మంగళవారం  తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఓటు విలువ పై ఓటరు లకు పాట, మాట, ఆటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు అర్జునరావు, పమ్మి రవి, సిహెచ్ కోటేశ్వరరావు, జి.సునీత, ఎం. ముత్తయ్య, కె.అపూర్వ తో పాటు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.