1995-1996 పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Published: Wednesday January 18, 2023

కోరుట్ల, జనవరి 17 ( ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో పూర్వ విద్యార్థులందరూ ఒక్క చోట కలుసుకొని గెట్ టు గెదర్ కార్యక్రమం నిర్వహించుకొని అలనాటి రోజులను, మధుర జ్ఞాపకాలను తలచుకొంటూ ఆనందాలతో ఉప్పొంగిపోయారు.పాటలు పాడుతూ,ఆటలు ఆడుతూ సంతోషంగా గడిపారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  బి నర్సయ్య, శ్రీనివాస్,దేవయ్య, డి.పీ.ఓ నరేష్, జగదీశ్వర్, శ్రీనివాస్, సత్తయ్య, ప్రవీణ్, శివకుమార్ పూర్వ విద్యార్థులందరూ పాల్గొన్నారు.