మానవసేవే మాధవసేవ అంటూ నిరుపేద కుటుంబాలకుబట్టలు

Published: Saturday July 23, 2022

వితరణ మధిర జూలై 22 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు
 సాయంత్రం మధిర పట్టణంలో ప్రముఖ సామాజిక సేవకులు లంకా కొండయ్య స్థానిక అజాద్ రోడ్డులో తాను నడుపుతున్న మహాత్మగాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ నుండి మండలంలొని వివిధ గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు మరియు ఒరిస్సా గిరిజన కూలీలు (ప్రస్తుతం వారు అనగా గిరిజన యువకులు ఒక కాంట్రాక్టర్ క్రింద బోర్ వెల్ వర్కర్ లుగా పని చేయుటకు వచ్చినవారు) స్థానిక కాంగ్రెస్ కార్యాలయం ఎదురు గా ఉన్న కొత్త కిరణా మార్చoట్ వద్ద వానకు తడిచి, పొడి బట్టలు లేక ఇబ్బందులు పడుతున్న హృదయ విధారక పరిస్థితి చూసి వెంటనే కొండయ్య తన బ్యాంక్ నుండీ వారికీ కావలిసిన బట్టలు తెచ్చి ఇచ్చారు అదే విధంగా రాయపట్నం లొని ఒక నిరుపేద కుటంబ నాకు మధిర ఎస్సి కాలనీలోని నిరుపేద మహిళలకు ఉచిత ముగా వివిధ దాతలు ఇచ్చిన బట్టలు వారికీ మానవతా ద్రుష్టి తో అందించినారు.

అదే విధంగా దాతలు ఇచ్చిన బట్టలను భద్రచలం వరద బాధితులకు పంపింస్తున్నట్లు కొండయ్య వివరించారు. ఈ కార్యక్రమం లో లంకా సేవ ఫౌండేషన్ వాలంటీర్లు కరుణ లియోనా, సన్నీ,గోపి, అంజి, పండు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.