మాటూర్ హైస్కూల్ విద్యార్థులకు బ్యాంకు అకౌంట్ లు అందచేసిన గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బంది

Published: Saturday December 11, 2021
మధిర డిసెంబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి : మధిర మండలం మాటూరు  గ్రామం  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపకారవేతనాలు 100% అందించుటలో భాగంగామధిర మండలంలోని మాటూర్ ఉన్నత పాఠశాల లోని 45 మంది ఎస్సి విద్యార్థులకు మాటూర్ గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బంది బ్యాంకు పాసుబుక్ లు అందించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయి కృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయి కృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం అందించే అన్ని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు పనులతో తీరిక లేకుండా ఉన్నప్పటికి విద్యార్థుల కోసం పాఠశాలకు వచ్చి బ్యాంకు అకౌంట్లు అందించినందుకు బ్యాంకు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ యం సాంబశివరావు, స్వాతి, రమేష్ లతో పాటు కళాశాల వసతి గృహ సంక్షేమ అధికారి యడ్ల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.