మండలంలో ఆరు కరోనా కేసులు నమోదు

Published: Friday January 21, 2022
మండల ప్రాథమిక ఆసుపత్రి డాక్టర్ వైద్యురాలు సునితా.  
జన్నారం రూరల్ జనవరి 20 ప్రజాపాలన: మండల ప్రాథమిక ఆసుపత్రిలో అరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జన్నారం ప్రాథమిక ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీతా తెలిపారు,  గురువారం మధ్యాహ్నం జన్నారం ప్రాథమిక ఆసుపత్రిలో యాబై మందికి కరోనా పరీక్షలు చేశామని అమె అన్నారు, దీనిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా గుర్తించడం జరిగిందని అమె తెలిపారు, మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు, ఈ నేపథ్యంలో మండల ప్రజలు మాస్కులు దరించి బౌతిక దూరం పాటిస్తూ  నిబం దనాలు అనుసపరించాలని అమె కోరారు, కాగా గత వారం రోజులుగా జిల్లా మంచిర్యాల మండలం జన్నారంలో సుమారు 21 కరోనా పాజిటివ్ కేసులు నమెాదయ్యాయన్నారు.