బీజేపీది ఉత్తుత్తి ప్రచారమేనా ?

Published: Monday May 31, 2021

చేసిన ప్రచారానికి కట్టుబడి ఉంటారా ? బి జె పి కి ప్రజల సూటి ప్రశ్న
సిద్ధిపేట, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : సిద్దిపేట పట్టణంలో గత మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ అవినీతిని ప్రశ్నిస్తాం, ప్రజల ముందుంచుతాం అంటూ ప్రచారం చేసిన బీజేపీ నాయకుల మాటలు నీటి మాటలా లేక నిజంగానే అధికార పార్టీ కనుక అవినీతి చేసి ఉంటె దానిని ప్రజల ముంచు ఉంచుతారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిద్ధిపేట లో అభివృద్ధి పేరుతొ అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని బి జెపి రాష్ట్ర నాయకత్వంతో సహా జిల్లా నాయకులు పలు అంశాలను లేవనెత్తారు, ఒక్క కోమటిచెరువును అభివృద్ధి చేస్తున్నామంటూ కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ప్రచారం చేశారు. ఇంకా సిద్ధిపేట లో జరిగిన ప్రతీ అంశంలో అధికార పార్టీ అవినీతికి పాల్పడిందని చెప్పిన బి జె పి పార్టీ ఎన్నికలు ముగిశాక ఎందుకు ఆ అంశాన్ని పట్టించుకోవట్లేదన్నది జనాల ప్రశ్న. ఆర్ టి ఐ లు పెట్టి అయినా దేంట్లో ఎంత అవినీతి జరిగిందో తెలపాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవేళ అలా అవినీతిని నిరూపించే ప్రయత్నాలు బి జె పి కనక చేయకపోతే అది ఆ పార్టీకే చేటని ప్రజలు ఇకముందు బి జెపి చెప్పే ఏ మాటలను నమ్మాలా వద్దా అనే పరిస్థితి వస్తుందన్నది విశ్లేషకుల వాదన. బి జెపి నిజంగానే ప్రజాసమస్యలపై పోరాడుతుందా లేదా ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజలు ఎలా నమ్మాలో మున్ముందు బిజెపి పోరాటాలు చేస్తుందో లేక ప్రజల దృష్టిలో చిత్తశుద్ధి లేని పార్టీగా ఉంటుందో చూడాల్సిందే