4న దుర్గమ్మతల్లికి బోనాలు

Published: Tuesday August 03, 2021
ఆలయ కమిటీ చైర్మన్ మద్దుల బాల్ రెడ్డి
గుమ్మడిదల, ఆగస్టు 02, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయంలో ఆషాడ మాస ఈ సందర్భంగా బుధవారం రోజు ఆగస్టు 4వ తేదీన దుర్గమ్మ బోనాల పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు  ఆలయ కమిటీ చైర్మన్ మద్దుల బాల్ రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలు ముందుగా గణపతి పూజ అమ్మవారికి పంచామృత అభిషేకం ప్రారంభమై ఒడిబియ్యం బోనాలు పలారం బండి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 5న గురువారం రోజు లింగమయ్య బోనం, పోతురాజు గావు, రంగం పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.