గంజాయి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

Published: Thursday February 23, 2023
జన్నారం, ఫిబ్రవరి 22, ప్రజాపాలన: మండల పోలీస్ స్టేషన్ పరిధిలో మంచిర్యాల టాస్క్ ఫోర్స్ పోలీసులు 218 గ్రాముల గంజాయి పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్సైలు అశోక్ మధుసూదన్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  మండల కేంద్రంలో గంజాయి సరపర విషయమై నమ్మదగిన సమాచారం మేరకు  మండల కేంద్రంలో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో అనుమాన స్పందన తిరుగుతున్న ఒక వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోగా ఆ వ్యక్తి వద్ద 218 గ్రాముల గంజాయి దొరికిందని తెలిపారు. నిందితుడు మండలంలోని లో తొర్రే గ్రామానికి చెందిన పటేల్ గా టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోబడం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా గంజాయిని ఒక వ్యాపారంగా దందా చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు  జన్నారం అదనపు ఎస్ఐ తానాజీ, నిందితులు పాల్గొన్నారు.