కార్పొరేట్ స్కూల్ లను తలదన్నేలా సర్కార్ బడులు జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేశ్

Published: Friday March 11, 2022

జగిత్యాల, మార్చి 10 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించుటకు జిల్లా పరిషత్ ద్వారా ఆమోదించబడిన అండర్ టేకింగ్ సర్టిఫికెట్స్ సంబంధిత ప్రధానోపాధ్యాయులకు జిల్లా ప్రజా పరిషత్  క్యాంప్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన దావ వసంత సురేష్ అందజేసినారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ పేద బిడ్డల బిడ్డలందరికీ కార్పొరేట్ స్థాయిలో విద్య అందించాలని మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించారని, విద్య వ్యవస్థ పటిష్ఠతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన కల్పించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సుందరవరధారాజన్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.