ఫస్ట్డి విజన్లో తెలంగాణ వేడుకలు

Published: Thursday June 03, 2021
బాలపూర్, జూన్ 02, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కలిసికట్టుగా మొదటి డివిజన్లో ఉన్న కాలనీవాసులు, అదే విధంగా రానున్న రోజుల్లో అన్నీ వేడుకలకు ముందుకు రావాలని కోరారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ కార్పొరేటర్ పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చిరు సన్మాన సత్కా రములు తో పాటు వారి సేవలను మరువలేనివని గుర్తు చేసుకుంటూ కాలనీవాసులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ. అతి తక్కువ వ్యవధిలో తన విన్నపమును అందుకుని, 7వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హాజరైన కాలనీ అధ్యక్షులుకు శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలుకుతూ జెండా ఎగర వేసి కాలనీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి ఆదేశాల మేరకు ఈ దినోత్సవం ను మొట్ట మొదటి సారి అన్ని కాలనీ ప్రెసిడెంట్స్ సమీక్షలో ఒకే చోట నాంది పలకడం మనసు తృప్తిగా ఉందని అన్నారు.. ప్రతి కాలనీ ప్రెసిడెంట్ తమ తమ ముఖ పరిచయాలు తెలియజేస్తూ కాలనీలో కార్పొరేటర్ చేపట్టిన అభివౄద్ధి పనులు చర్చనీయాంశముగా సాగాయి.. ఇంకా కొన్ని పనులు చేయాల్సినవి కూడా ఉన్నాయినీ చెప్పారు. అందులో ముఖ్యంగా ట్రంక్ లైన్ గురించి చర్చించి ఎంత త్వరగా పూర్తి చేయటానికి ప్రయత్నిస్తున్నానీ అన్నారు. కాలనీ లను రోజూ పరిశుభ్రంగా ఉంచడానికి కారకులైన కార్మికులకు సన్మాన సత్కారములు చేస్తూ తన పెద్ద మనసును చాటుతూ వాళ్ళు చేస్తున్న పనులకు సమాజంలో గౌరవ మన్ననలు ఉండాలని కోరారు. వారి సేవలు మరువలేనివని చెప్పారు. కాలనీ వాసులందరికీ రానున్న రోజులలో కూడా ఇలానే అందరు కలిసి కట్టుగా అన్ని వేడుకలకు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి కోరారు. కాలనీ అధ్యక్షులకు కాలనీవాసులు అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  కాలనీవాసులు అధ్యక్షులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.