దేవాలయాల భూములను ఆక్రమించిన ఎండి అబ్జల్ బాబా పై చర్యలు తీసుకోవాలి జాతీయ కాంగ్రెస్ నాయకులు
Published: Friday December 30, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి: హిందూ దేవుళ్లకు సంబంధించిన నాలుగు ఎకరాల స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా ఇల్లు నిర్మించించి నివాసం ఉంటున్న అఫ్జల్ బాబాపై చర్యలు తీసుకొని, దేవుళ్ళ స్థలాలను దేవుళ్ళకు అప్పగించాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మద్దెల శ్రీనివాస్ సంబంధిత అధికారులకు గురువారం విజ్ఞప్తి చేశాడు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు,
బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 170 బుధాకలాన్ శివారు రవీందర్ నగర్ లో హిందువుల ఆరాధ్య దైవమైన భూలక్ష్మి, మహాలక్ష్మి, మరియు ఎల్లమ్మ గుడులకు చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని, మొహమ్మద్ అబ్దల్ బాబా అనే వ్యక్తి, కాంట్రాక్టర్ బస్తీ నివాసి అక్రమంగా దేవాలయాల భూమిని కబ్జా చేసి ఇల్లు నిర్మించి మున్సిపల్ ద్వారా ఇంటి నెంబర్ తీసుకున్నాడని, అక్రమంగా దేవాలయాల భూమిని ఆక్రమించిన అబ్దుల్ బాబా పై తగిన చర్యలు తీసుకొని, ఇంటికి ఇచ్చిన నంబర్లను మున్సిపల్ అధికారులు రద్దు చేసి, హిందూ దేవుళ్లకు సంబంధించిన స్థలం నుండి అతన్ని ఖాళీ చేయించి, స్థలాన్ని హిందూ దేవాలయాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై స్థానిక ఆర్డిఓ, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ లకు బుధవారం ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు.
Share this on your social network: