ఆళ్ళపాడు లో పంట రుణాలపై అవగాహన సదస్సు
Published: Friday September 16, 2022
బోనకల్, సెప్టెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో ఏపీజీవిబీ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆపిషర్ చిరంజీవి గురువారం పంట రుణాలపై అవగాహన కల్పించారు. సకాలంలోపంట ఋణాలు వడ్డీలు చెల్లించి తక్కువ రాయితీ వడ్డీ పొందాలని రైతులకు అవగాహన తెలియజేశారు.లబ్ధిదారులకు ఏటీఎం కార్డు ద్వారా నగదు డ్రా తీసుకునే విధంగా వారికి ఏటీఎం కార్డులను పంపిణీ చేసి లబ్ధిదారులకు ఏటీఎం కార్డు సేవలు గురించి సలహాలు సూచనలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఫీల్డ్ ఆపిర్ చిరంజీవి, బ్యాంకు క్యాష్ ఇయర్ జ్యోతి, బ్యాంకు మీత్ర ,రైతులు పాల్గొన్నారు.
Share this on your social network: