మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి ఎంపీపీ అన్నం మంగ-చిన్నన్న.

Published: Thursday March 09, 2023

లక్షేట్టిపెట్, మార్చి 08, ప్రజాపాలన:

 
 మహిళలు అన్ని రంగాలలో  ముందుండాలని  ఎంపీపీ అన్నం మంగ-చిన్నన్న పేర్కొన్నారు. బుధవారం  అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పట్టణం లోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మహిళా ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్యాతిథిగా  పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ ఆదేశాల మేరకు పార్టీ ఆధ్వర్యంలో  మున్సిపాలిటీ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా ప్రజా ప్రతినిధులకు సన్మానం చేయడం  అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింత అశోక్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్,  లక్షట్ పేట పట్టణ కాంగ్రెస్  అధ్యక్షులు ఆరిఫ్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు,  కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.